Tuesday, June 26, 2018
Tuesday, April 18, 2017
పది రూపాయలకే వైద్యం -అనపర్తి డాక్టర్
అనపర్తిలో పెద్ద డాక్టర్ గా మరియు YSRCP కో-ఆర్డినేటర్ గా ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న గొప్ప వ్యక్తి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు. ఈయన పొలమూరు గ్రామములో 1961వ సంవత్సరం అక్టోబర్ 31న జన్మించారు. తండ్రి సత్తి గంగిరెడ్డి గారు, తల్లి సీతయ్యమ్మ గారు. ఈయనకు ఒక సోదరుడు. పేరు గోపాలకృష్ణారెడ్డి. ఈయన 1 నుండి 5వ తరగతి వరుకు పొలమూరు MPUP స్కూల్ లో చదువుకున్నారు. ఆ తరువాత ఇంటర్ మీడియట్ విజయవాడలో చదివారు. ఆపై చదువులు MBBS కూడా విజయవాడ సిద్దార్ద మెడికల్ కాలేజిలో చదివారు. ఆ తరువాత MS చేయడానికి కర్ణాటక రాష్ట్రం లో దావనగిరిలో JJM మెడికల్ కాలేజిలో పూర్తిచేసారు. చిన్నప్పటి నుండి తన మేనమామ అయిన కంటి డాక్టర్ T. సత్యనారాయణ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకున్నానని, ఆయనలా నేను కూడా డాక్టర్ కావాలనుకున్నానని, ఎంతో మందికి వైద్య చికిత్సలు చేయాలని అనుకునేవారు. ఈయన ఎప్పుడూ ఒక మెరిట్ స్టూడెంట్ గానే కొనసాగేవారు. అందరూ ఈయన్ని ముద్దుగా సూరిబాబు అని పిలుస్తారు. ఇంట్లో ఎప్పుడూ కూడా తగిన ప్రోత్సాహం ఉండేది. 1983 వ సంవత్సరం, మే 31 న ఆదిలక్ష్మి గారితో ఆయన వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు. పేరు గౌతమ్ రెడ్డి. ఆయన కూడా డాక్టర్. సూర్యనారాయణ రెడ్డి గారు ఖాళీ సమయాలలో మేగ్ జైన్ లు చదువుతూ ఉంటారు. తన వృత్తే తన హాబీ అని అంటున్నారు. ఈయన Non - veg ఇష్టంగా తింటారు. ఇష్టమైన కలర్ రెడ్. ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటారు. 1991వ సంవత్సరం, నవంబర్ 21న అనపర్తి లో వారి తండ్రి పేరు మీద గంగిరెడ్డి నర్సింగ్ హోమ్ ఏర్పాటు చేయడం తన జీవితంలో మరిచిపోలేని రోజు అని ఆయన తెలిపారు. అయితే తనను డాక్టర్ గా చూడాలనుకున్న వారి నాన్నగారి కోరిక, ఈయన డాక్టర్ అయిన 3 నెలలోనే ఆయన కాలం చేయడం తన జీవితంలో అత్యంత భాదాకర సంఘటన అని తెలిపారు. కుటుంభ ఐక్యత - బందు వర్గం తనకు బలమైతే, మొహమాటం ఈయన ప్రధాన బలహీనత. ఈయనకు ఇష్టమైన ఆట కబడ్డీ. జీవితంలో ఒకరే ఇష్టమైన స్నేహితుడని కాకుండా అందరిని స్నేహితులగానే భావిస్తానని ఆయన తెలియజేసారు. అనపర్తి చుట్టు ప్రక్కల గ్రామాలు అంటే తనకు ఎంతో ఇష్టమని, అందుకనే ఇక్కడ హాస్పటల్ ప్రారంభించానని, ఈ రోజుకి కూడా జిల్లాలో ఒక సింగిల్ డాక్టర్ ఇంత మంది పేషెంట్లకు సర్జరీ చేయడం గర్వంగా ఉందని ఆయన తెలిపారు. ఈ రోజుకి కూడా ఎక్కడా లేని విధంగా 10 రూపాయలకే వైద్యం అందిస్తున్నారు. లేనివారికి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. అనపర్తిని రాజకీయాలలో ఆదర్శంగా తీర్చిదిద్దాలనేది ఆయనకు ఉన్న ఒక డ్రీమ్ వర్క్. 2014 లో YSRCP పార్టీ తరుపున MLA గా పోటి చేసి స్వల్ప మెజారిటి తో ఓటమి చెందారు. అందుకు ఏ రోజు తాను బాదపడలేదని, తనకు ఆ ఓటమి ఒక గుణపాఠమని ఆయన తెలిపారు. అనపర్తి లో ఉన్న ప్రతీ సమస్యపై పోరాటం చేస్తానని ఆయన అన్నారు. కొంత కాలముగా అనపర్తిని పట్టి పీడిస్తున్న కెనాల్ రోడ్ సమస్యకి ప్రజలు, స్వచ్చంద సంస్థలు సహకారంతో వేల మందితో పాదయాత్ర చేయడం జరిగింది. ఈ రోజుకి గడపగడపకు YCP పేరుతో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. గత ప్రభుత్వాలు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసిన వారికి ఇళ్ళ స్థలాలు కేటాయించాలని మహిళలతో కలిసి దర్నా నిర్వహించారు. ఇంకా రాబోయే రోజులలో మరిన్ని సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. 2019 లో YSRCP తరుపున MLA గా పోటిచేసి గెలిచి ప్రజలందరిని గర్వంగా తల ఎత్తుకునేలా చేస్తానని ఆయన తెలిపారు.
భవిష్యత్ లో ఈయన మరిన్ని గొప్ప విజయాలు సాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ - మన అనపర్తి....
Saturday, February 4, 2017
Tuesday, December 27, 2016
Saturday, November 12, 2016
రూ.2వేల నోటు నకిలీ వచ్చింది : బీ అలర్ట్
జస్ట్ 48 గంటలు మాత్రమే అయ్యింది. రూ.2వేల నోటు మార్కెట్ లోకి వచ్చిందో లేదో అప్పడు నకిలీలు తయారయ్యాయి. జిరాక్స్ కాపీలు తీసి.. రద్దీ ఏరియాల్లో చెలామణి చేస్తున్నారు కేటుగాళ్లు. రూ.2వేల నోటు టీవీలు, పపేర్లలో చూడటమేగానీ.. కోట్లాది మందికి అది చేరువ కాలేదు. దీన్ని అలుసుగా తీసుకుని బురిడీ కొట్టిస్తున్నారు దొంగలు. కర్నాటకలోని చిక్ మంగళూరులో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా అందర్నీ అలర్ట్ చేసింది. చిక్ మంగళూరులోని APMC మార్కెట్ ఉంది. అశోక్ అనే రైతు మార్కెట్ కు ఉల్లిపాయ సంచులు తీసుకొచ్చాడు. అతని దగ్గర ఉల్లి సంచులు కొనుగోలు చేసిన గుర్తు తెలియని వ్యక్తి.. రూ.2వేల కొత్త నోటు ఇచ్చాడు. బ్యాంకులో ఇచ్చారని.. చెల్లుతుందని గట్టిగా చెప్పాడు. అప్పటికే పేపర్లు, టీవీల్లో చూసిన రైతు అశోక్.. నోటు తీసుకున్నారు. కొత్త నోటును స్నేహితులకు చూపించాడు. వాళ్లు దాన్ని చూసి అనుమానం వ్యక్తం చేశారు. ఇది కలర్ జిరాక్స్ తీసిన నోటులా ఉంది.. నాణ్యతలో కూడా తేడా ఉంది అని గుర్తించారు. దీనిపై చిక్ మంగళూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు రైతు. అలర్ట్ అయిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్నామలై వెంటనే రంగంలోకి దిగారు. రైతుతోపాటు APMC మార్కెట్ కు వచ్చి విచారణ చేశారు. రైతుకు ఇచ్చిన నోటు కలర్ జిరాక్స్ కాపీ అని.. కొత్త రూ.2వేల నోటుతో జాగ్రత్తగా ఉండాలని వ్యాపారులు, రైతులను అలర్ట్ చేశారు పోలీసులు. దీనిపై 420 కింద కేసు నమోదు చేశారు.
Friday, November 11, 2016
ఇప్పుడు పాత నోట్లివ్వండి.. వారం తర్వాత కొత్త నోట్లిస్తాం
రద్దయిన రూ.500, 1000 నోట్లను మార్చే కమీషన్ ఏజెంట్లు ఇప్పుడు ఎక్కడ చూసినా హల్చల్ చేస్తున్నారు. ఒక్కో ఖాతాలో రూ.2.5 లక్షల జమ పరిమితి విధించడంతో బడాబాబులు ఇలాంటివారిని ఆశ్రయిస్తున్నారు. వారి డబ్బు మార్చి పెడతామని.. అందుకు తమకు 15 నుంచి 25 శాతం దాకా కమీషన్ ఇవ్వాలని దళారులు వారితో ఒప్పందం చేసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ తరహా దందా బాగా జరుగుతోంది. అయితే, పాత నోట్లు ఇప్పుడు తీసుకుని వారం తర్వాత కొత్త నోట్లు ఇస్తామంటుండడంతో కొందరు వెనకాడుతున్నారు. కొందరు మాత్రం ధైర్యం చేసి ఓకే అంటున్నారు.
Wednesday, November 9, 2016
Subscribe to:
Posts (Atom)