Wednesday, November 9, 2016

వడ్డీ లేకుండా రుణాలంటూ కొందరి ఆఫర్‌...



గుంటూరు (నల్లచెరువు) : పెద్ద నోట్లు రద్దు అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మంగళవారం రాత్రి నుండి జనంలో బ్లాక్‌ మనీపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మోదీ సాహోసపేత నిర్ణయం తీసుకున్నారంటూ ప్రజలంతా ముక్త కంఠంతో అభినందిస్తున్నారు. ఇదిలా ఉండగా పెద్ద నోట్లు రద్దు చేయడంతో బ్లాక్‌ మనీ బడాబాబులు దాన్ని వైట్‌ చేసుకునేందుకు పలు రకాల ఆలోచనలు చేస్తున్నారు. కొందరు తమకు తెలిసిన వారికి ఏడాది పాటు వడ్డీ లేకుండా రుణం ఇస్తామని ఆశ చూపుతున్నారు. ఏడాది తరువాత అసలు ఇస్తే చాలని అంటున్నారు. ఇలా రూ. లక్ష రెండు లక్షలు కాదు ఏకంగా రూ. 50 లక్షలు అయినా ఇస్తామంటున్నారు. ఇలాంటి వారు గుంటూరులో పెద్ద సంఖ్యలో ఉన్నారు.

No comments:

Post a Comment